అమరావతి: అమృత్పాల్ సింగ్,ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ ను పోలీసులు అదివారం అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు..ఇతను మార్చి 18 నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు..పంజాబ్లోని మోగాలో అమృతపాల్ సింగ్ ను ఉదయం 6.45 గంటలకు అరెస్టు చేశామని తెలుపుతూ పోలీసులు ట్వీట్ చేశారు.. అమృత్సర్ పోలీసులు,పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయని, పవిత్రతను కాపాడుకోవడానికి పోలీసులు గురుద్వారా సాహిబ్లోకి ప్రవేశించలేదని తెలిపారు..ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ కేసులో పంజాబ్ పోలీసులు 207 మందిని అరెస్ట్ చేశారు..అమృత్ పాల్ ను అదుపులోకి తీసకున్న పోలీసులు,, అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించనున్నట్టు తెలుస్తోంది..
(అమృత్ పాల్కు అత్యంత సన్నిహితుడైన లవ్ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్ను ఫిబ్రవరిలో పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు..సదరు అరెస్టును వ్యతిరేకిస్తూ అమృత్పాల్ అనుచరులు పెద్ద సంఖ్యలో అమృత్సర్ జిల్లాలోని అజ్నాలా పోలీస్స్టేషన్పై దాడికి ప్రయత్నించారు..ఈ క్రమంలో అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్పాల్పై అప్పట్లో కేసు నమోదైంది..అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు).
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.