NATIONAL

దీపావళి వేడుకల్లో కాల్చే టపాసులపై నిషేధం విధించి క్రేజీవాల్ ప్రభుత్వం

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో కాల్చే టపాసులపై క్రేజీవాల్ ప్రభుత్వం నిషేధం విధించింది..టపాసులను కాల్చిన సందర్బంలో వచ్చే కాలుష్యంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నరంటూ గత సంవత్సరం విధించిన నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు కొనసాగించాలని నిర్ణయించింది..ఢిల్లీలో వాయు, శబ్ద కాలుష్యాలను నివారించేందుకు అన్ని రకాల టపాసుల ఉత్పత్తి,,నిల్వలు,,రవాణ,, ఆమ్మకాలను,,వినియోగాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు..ఆన్ లైన్ ద్వారా జరిపే విక్రయాలను కూడా నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు..నిషేధం ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని,,వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ వరకు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు..నిషేధం ఉత్తర్వులు కఠినంగా అమలు చేస్తామని,,ఇందుకోసం త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని గోపాల్ రాయ్ వెల్లడించారు..గత సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ నుంచి 2022 జనవరి 1వ తేది వరకు టపాసుల విక్రయాలతోపాటు వినియోగాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది..నిషేధం ఉత్తర్వులు ఉల్లంఘించి యధావిధిగా టపాసులు కాల్చిన వారితో పాటు వారికి టపాసులు అమ్మిన వారిపై జరిమానాలు విధించింది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *