రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలకు అవకాశం-ఐఎండీ
అమరావతి: నిప్పుల గుండంగా మారిన రాష్ట్రంలో రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది..ద్రోణి ఆంధ్ర ప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది.. నైరుతి రుతుపవనాలు రాబోయే 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు విస్తరించే అవకాశమున్నది..ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని తెలిపింది..ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర… రాయలసీమ ప్రాంతాలలో అక్కడక్కడ తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం అవకాశం ఉందని వెల్లడించింది..
దక్షిణ కోస్తా ఆంధ్ర:- గురువారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది..వేడితో కూడిన ఇబ్బంది కలిగించే వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది.. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుంచి 4° డిగ్రీలు పెరుగుదల ఉండే అవకాశము ఉన్నది..
శుక్రవారం:- ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.. వేడితో కూడిన,,ఇబ్బంది కలిగించే వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది..