AMARAVATHI

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు,ఎల్లుండి భారీ వర్షాలకు అవకాశం-IMD

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న క్రమేపి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 20వ తేది నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఆవకాశం వుందని, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.20, 21, 22 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు,, 21, 22 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చు అని IMD పేర్కొంది.40-55 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

పెరుగుతున్న చలి:- రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతల్లో గత రెండు రోజుల నుంచి ఉష్టోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువ నమోదు అవుతున్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.4 డిగ్రీలు, పాడేరు,అరకులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.చింతపల్లి ఏజెన్సీలో సాయంత్రం నుంచే మంచు కురుస్తోంది. పొగమంచుతో మన్యం ప్రాంత వాసులు వణికిపోతున్నారు.శనివారం నుంచి చలి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వివరించింది. పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *