x
Close
NATIONAL

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు ముందే భారీగా పట్టుబడిన ఆయుధాలు

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు ముందే భారీగా పట్టుబడిన ఆయుధాలు
  • PublishedAugust 23, 2022

అమరావతి: గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పంజాబ్ పర్యటన సందర్బంగా తలైత్తి లోపాలను దృష్టిలో వుంచుకుని,, అధికారులు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదే సమయంలోనే భారత్-పాక్ సరిహద్దుల వద్ద చేపట్టిన సోదాల్లో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF), పంజాబ్‌ పోలీస్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం మంగళవారం అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.ఈ ఆయుధాలు పాకిస్థాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది వేకువజామున, సీమా బాల్ సిబ్బంది ఫిరోజ్‌పూర్ సెక్టార్ నుంచి 6 మ్యాగజైన్‌లతో కూడిన మూడు AK సిరీస్ రైఫిల్స్, 4 మ్యాగజైన్‌లతో కూడిన రెండు M3 సబ్-మెషిన్ గన్‌లు,రెండు మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నారు.డ్రోన్ల ద్వారా ఆయుదాలు జారా విడిచారా అన్న దిశలో కూడా విచారణ చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 24వ తేదిన పంజాబ్ లోని మొహాలి,ముల్లన్‌పూర్‌లో హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. మొహాలీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హెచ్‌ఎస్ మాన్ మాట్లాడుతూ, ‘ఆగస్టు 24న ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నామని, భద్రతా ఏర్పాట్లలో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని’ తెలిపారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *