x
Close
AMARAVATHI

రాష్ట్రానికి వాతావరణశాఖ హెచ్చరిక

రాష్ట్రానికి వాతావరణశాఖ హెచ్చరిక
  • PublishedAugust 18, 2022

అమరావతి: మంగళవారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఈరోజు రాయలసీమ నుంచి కొమొరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తువరకు వరకు విస్తరించి ఉందని,,ఆంధ్రప్రదేశ్ లో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు, హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది..ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్:– యానాం: ఈ రోజు , రేపు , ఎల్లుండి (ఆగష్టు20వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ఈ రోజు, రేపు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.. గురువారం,శుక్రవారం ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది..శనివారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది..

రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి (ఆగష్టు20వ తేదీ) తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.