AMARAVATHIPOLITICS

ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

అమరావతి: కాంగ్రెస్ పార్టీ యువరాజు ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడింది..అయన ఎంపీగా చెల్లబాటు కారని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు..‘మోదీ అనే పేరువున్నవారాంత దొంగలు అంటూ వ్యాఖ్యనించిన కేసులో పరువునష్టం కేసులో సూరత్ కోర్టు వేసిన రెండేళ్ల శిక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేక ఆపైన శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది..సూరత్ కోర్టు నాలుగేళ్ల విచారణ తరువాత రాహుల్‌ని దోషిగా తేల్చడమే కాక 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా కూడా విధించింది..ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి కానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు..ప్రస్తుతం కేరళలోని వాయనాడ్‌ నుంచి ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీపై నిన్నటి నుంచే అనర్హత వేటు అమలులోకి వచ్చింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *