జావెలిన్ త్రోలో డైమండ్ ను ఒడిసి పట్టిన నీరజ్ చోప్రా

అమరావతి: భారతదేశ స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ ఫైనల్లో విజయం కేతనం ఎగురవేశాడు..జావెలిన్ ను 88.44 మీటర్లకు విసిరి టైటిల్ను చేజ్కికున్నాడు..డైమండ్ లీగ్ ఛాంపియన్గా నిలిచిన భారత తొలి అథ్లెట్గా నీరజ్ రికార్డులకెక్కాడు..చెక్ రిపబ్లిక్ కు చెందిన అథ్లెట్ జాకుబ్ వడ్లెజ్చ్ 86.94 మీటర్ల బెస్ట్ త్రోతో రెండవ స్థానంలో నిలిచాడు..జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 83.73 మీటర్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు..డైమండ్ లీగ్ ఫైనల్స్ లో త్రోస్ ప్రారంభమైన తరువాత తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఫౌల్ చేశాడు.. రెండో ప్రయత్నంలో మాత్రం 88.44 మీటర్లు జావెలిన్ ను విసిరి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు..3వ ప్రయత్నంలో 88 మీటర్లు, 4వ ప్రయత్నంలో 86.11 మీటర్లు విసిరాడు..చివరి ప్రయత్నంలో 87 మీటర్లు జావెలిన్ విసిరాడు..లీగ్ లో నీరజ్తో పోటీ పడడంలో మిగిలిన అథ్లెట్లు విఫలం అయ్యారు..2017, 2018లోనూ డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్ కు నీరజ్ అర్హత్ సాధించినప్పటికి,,టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు.
Golds,Silvers done, he gifts a 24-carat Diamond 💎 this time to the nation 🇮🇳🤩
Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw.
FIRST INDIAN🇮🇳 AGAIN🫵🏻#indianathletics 🔝
X-*88.44*💎-86.11-87.00-6T😀 pic.twitter.com/k96w2H3An3
— Athletics Federation of India (@afiindia) September 8, 2022