INTERNATIONALSPORTS

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ లో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్​ చోప్రా

అమరావతి: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022లో భారత స్టార్​ అథ్లెట్​ నీరజ్​ చోప్రా(24) అద్వితీయ ప్రదర్శన కనబరిచి(రజత) సిల్వర్ మెడల్ సాధించాడు..అమెరికాలోని యుజీన్‌లో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఫైనల్‌లో నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం జావెలిన్‌ను  విసిరిన నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు..జపాన్ కు చెందిన వద్లెచ్​ 88.09 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు..రజత పతకం గెల్చిన నీరజ్​ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్ర సృష్టించిన నీరజ్​ను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. క్రీడల్లో భారత్​కు ఈ పతకం ఎంతో ప్రత్యేకమైనదని కొనియాడారు. రానున్న టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు మోదీ. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్​ రిజిజు సహా పలువురు ప్రముఖులు నీరజ్​కు అభినందనలు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *