NATIONALPOLITICS

సీ.ఎం పదవీకి రాజీనామ చేసిన నితిశ్ కుమార్

అమరావతి: బీహార్ రాజకీయ పరిణామాలు గంట గంటకు మారిపోతున్నాయి.. సీఎం పదవి నుచి తప్పుకుంటున్నట్లు నితీశ్ కుమార్,, గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేశారు..తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఏకాభిప్రాయం మేరకు ఎన్డీఏ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు గవర్నర్ ను కలిసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రకటించారు.. రాజీనామా అనంతరం నితీశ్ కుమార్ రాజ్ భవన్ నుంచి రబ్రీ దేవి నివాసానికి వెళ్లారు..ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది..160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో సాయంత్రం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనట్లు సమాచారం..ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్తో కలిసి,,నితీశ్ మరోసారి గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరనున్నట్లు సమాచారం..బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా,, ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల మద్దతు అవసరం..నితీశ్ నేతృత్వంలోని JDUకు 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, RJDకి 79, ఇతరులు 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *