జేసీబీలతో కూల్చివేతలపై నిషేధం విధించాలేం-సుప్రీమ్ కోర్డు

ఆక్రమ కట్టడాలు..జేసీబీలు..
అమరావతి: దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాల్లో మునిసిపల్ అధికారులు జేసీబీల సాయంతో చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతపై బుధవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..కూల్చివేతలపై నిషేధం విధించలేమని,,అ విషయం పూర్తిగా మునిసిపల్ అధికారుల పరిధిలోని అంశమని,,అయితే ఎవరైనా చట్టానికి లోబడి నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది..దేశవ్యాప్తంగా జేసీబీ కూల్చివేతలపై నిషేధం విధించాలని,,ప్రత్యేకించి ఇస్లాం కమ్యూనిటీకి చెందిన కట్టడాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఉలామా-ఐ-హింద్ అనే సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది..ఈ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయగా,,ఇందుకు యూపీ ప్రభుత్వం బదులు ఇస్తూ,, కూల్చివేతలు అనేవి సర్వసాధారణంగా జరిగే వ్యవహారమని,, ఉద్దేశపూర్వక చర్యలు కావని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది..ఇదే సమయంలో మధ్యప్రదేశ్,, గుజరాత్ ప్రభుత్వాలకు కూడా సుప్రీం కోర్టు జవాబు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది..బుధవారం వాదనల సందర్భంలో, ప్రత్యేకంగా కమ్యూనిటీ అనే పదాన్ని ప్రస్తావించారు పిటిషనర్లు..ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారని,, అల్లర్లకు సాకుగా చేసుకుంటున్నారని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు..ఇందుకు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేలు ప్రభుత్వాల తరపున వాదనలు వినిపిస్తూ,,దేశంలో ‘అంతా భారతీయ కమ్యూనిటీలే’ ని వ్యాఖ్యానించారు..అల్లర్లకు,, ఆక్రమ కట్టడాల కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని,, అవసరంగా సంచలనం చేయాలని చూస్తున్నారంటూ పిటిషనర్ల వాదనను తప్పుబట్టారు..ఈ క్రమంలో పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు,,కూల్చివేతలపై నిషేధం విధించలేమని స్పష్టం చేసింది..