అమరావతి: రాష్ట్రంలో కొత్త సబ్ డిస్ట్రిక్ట్ లను ఏర్పాటు కోసం ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.. రాష్ట్రంలోని అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్ లను ఏర్పాటు చేస్తూన్నట్టు నోటీఫికేషన్ లో తెలిపింది..భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగంగా చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది..ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది..కొత్త సబ్ డిస్ట్రిక్ట్ లను ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా సబ్ డిస్ట్రిక్ట్ లలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి గురించి స్పష్టత వచ్చింది..కొత్త సబ్ డిస్ట్రిక్ట్ లలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది..రిజిస్ట్రేషన్ల చట్టం 1908, సెక్షన్ 5 కింద సబ్ డిస్ట్రిక్ట్ ల ఏర్పాటు జరిగింది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.