నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని కార్పొరేషన్ మేయర్. స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సర్వసభ్య బడ్జెట్ సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన 2023-24 ఆర్ధిక సంవత్సరం యొక్క సవరించిన బడ్జెట్ అంచనాలు రూ. 99.21 కోట్ల రూపాయల ప్రారంభ నిల్వతో మొదలై స్వంత నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటులతో కలిపి రూ. 232.67 కోట్ల రూపాయలు జమలుగా, రూ. 219.02 కోట్ల రూపాయలు ఖర్చులుగా సవరించటం జరిగింది.
2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో రూ. 112.86 కోట్ల రూపాయలు ప్రారంభ నిల్వగా, రూ. 332.01 కోట్ల రూపాయల జమలకు గానూ మొత్తం రూ.437.01 కోట్ల రూపాయలు ఖర్చుగా ప్రతిపాదించి ఆమోదం పొందటమైనది. నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ ను కేటాయించడం జరిగిందని మేయర్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్.,, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.