NATIONAL

భగత్‌సింగ్‌ పేరును చంఢీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ

అమరావతి: చంఢీగడ్ విమానశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పేరును చంఢీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదివారం నిర్వహించిన మన్ కీ బాత్ ప్రసంగంలో స్వయంగా వెల్లడించారు. భగత్‌సింగ్‌ జయంతి వేళ ఆయనకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరేంద్రమోదీ తెలిపారు. వాతావరణ మార్పులు, ఇటీవల భారత్‌కు తీసుకువచ్చిన చీతాలు వంటి విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. సెప్టెంబర్‌ 28న భగత్‌సింగ్‌ జయంతి జరుపుకోనున్న వేళ సమరయోధుడికి నివాళిగా చంఢీగఢ్‌ ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.సముద్ర తీర ప్రాంతాలకు వాతావరణ మార్పులు పెను సవాలుగా మారాయని, బీచ్‌లలో చెత్త పేరుకుపోవడం కలవరపెడుతున్న విషయమన్నారు. ఇలాంటి తీవ్ర సవాళ్లను మనందరి బాధ్యతగా కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించారు. సుదీర్ఘ కాలం తర్వాత దేశంలోకి చీతాలు రావడంపై దేశవ్యాప్తంగా ఎంతోమంది సంతోషం వ్యక్తం చేశారని, చీతాలను ఎప్పటినుంచి చూడవచ్చు అనే విషయంపై, వాటిని పర్యవేక్షిస్తోన్న టాస్క్‌ ఫోర్స్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీ సిద్ధాంతకర్త దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. రాబోయే పండుగల సందర్భంగా ప్రజలు స్థానికంగా తయారుచేసిన నాన్ ప్లాస్టిక్ సంచులను వాడాలని సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో, భగత్ సింగ్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 28ని ప్రత్యేక దినోత్సవంగా నిర్వహించుకోవాలని సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *