x
Close
INTERNATIONAL

మాంగ్రోవ్ ఫారెస్ట్ లో మొక్కలు నాటిన ప్రధాని మోదీ

మాంగ్రోవ్ ఫారెస్ట్ లో మొక్కలు నాటిన ప్రధాని మోదీ
  • PublishedNovember 16, 2022

G 20 సమ్మిట్..

అమరావతి: ఇండోనేషియాలో రెండవ రోజు G 20 సమ్మిట్ కొనసాగుతోంది. మాంగ్రోవ్ ఫారెస్ట్ లో వివిధ దేశాల అగ్రనేతలు సమావేశం కాగా ఈ గ్రూప్ లో (మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్) భారత్ చేరింది. ఈ సందర్బంను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ, మాంగ్రోవ్ ఫారెస్ట్ ను సందర్శించి,ఇతర దేశాధినేతలతో కలసి మొక్కలు నాటారు. మంగళవారం ఎన్వీరాన్ మెంటల్,, హెల్త్ అంశాలపై చర్చించనున్నారు. ఇండోనేషియా ప్రధాని విడోడో, స్పెయిన్ ప్రధాని పెడ్రో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో పాటు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. సోమవారం జరిగిన సదస్సులో వివిధ దేశాధినేతలతో ప్రధానిమోడీ సమావేశమై,, దౌత్య సంబంధాలు, అభివృద్ధి సహా వివిధ అంశాలపై చర్చించారు. గాల్వాన్ ఘటన తరువాత మొదటి సారి G 20 సమ్మిట్ లో భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశమయ్యారు.తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధానిమోడీ  భేటీ అయ్యారు. రెండు దేశాల వ్యూహత్మక సంబంధాలపై ఇద్దరు సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతోపాటు రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై భేటీలో చర్చించారు. G 20 సదస్సులో బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్,  ప్రధానిమోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని,భారత్ ప్రతిభకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే సీఈవోలుగా ఉన్నారని తెలిపారు. ప్రపంచ శాంతి కోసం అందరు కలిసి కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.నేడు G 20 ముగింపు సభలో ఇండోనేషియా  G 20 అధ్యక్ష బాధ్యతలు భారత్ కు అప్పగిస్తుంది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.