NATIONAL

మే 28వ తేదిన కొత్త పార్లమెంట్ భవనాన్నిప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

అమరావతి: పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం దాదాపు ఖరారు అయింది.. ప్రధాని మోడీ మే 28వ తేదిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తారు.. 2020 డిసెంబర్‌లో ప్రధాని కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను శంకుస్థాపన చేయగా 2021 అక్టోబర్ 1వ తేది నుంచి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.. రూ.970 కోట్ల అంచనా వ్యయంతో ఈ  కొత్త పార్లమెంట్ ను  నిర్మించారు..ఈ నిర్మాణ పనులను కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఆధ్యర్వంలో జరుగుతున్నాయి..64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం నాలుగు అంతస్తులు వుంటాయి..మొత్తం 1,224 మంది ఎంపీలకు  కూర్చునేలా డిజైన్ చేశారు..కొత్త పార్లమెంట్ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉంటాయి..జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్,  కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు..అలాగే పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు వివిధ కమిటీ గదులు అధునిక హంగులతో రూపుదిద్దుకున్నాయి..కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ తో పాటుగా  దేశానికి ప్రధాన మంత్రులుగా పని చేసిన వారి ఫొటోలను ఏర్పాటు చేస్తున్నారు..పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు,, జూలైలో కొత్త భ‌వ‌నంలో జ‌రుగుతాయ‌ని తెలుస్తొంది.. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *