ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొందిన 45 మందితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు..ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాలో నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేస్తామని,,అలాగే కొత్త టెక్నాలజీ, స్మార్ట్ క్లాస్రూంలు ఉంటాయన్నారు. ఈ పాఠశాలల ద్వారా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులకు మేలు జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Today, on #TeachersDay I am glad to announce a new initiative – the development and upgradation of 14,500 schools across India under the Pradhan Mantri Schools For Rising India (PM-SHRI) Yojana. These will become model schools which will encapsulate the full spirit of NEP.
— Narendra Modi (@narendramodi) September 5, 2022