HYDERABADMOVIE

పుష్ప-2 పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన చిత్ర బృందం

హైదరాబాద్: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన పుష్ప ది రైజింగ్ పేరుతో పార్ట్-1 తెరకెక్కగా,,ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ అంటూ బన్నీ మరోసారి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించనున్నాడు..ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడిన నేపధ్యంలో సోమవారం మంచి మూహుర్తం వుండడంతో ఈ చిత్రంకు సంబంధించి పూజా కార్యక్రమాలను చిత్ర దర్శక,నిర్మాతలు పూర్తి చేశారు..అల్లు అర్జున్‌ ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌ లో పలు ఈవెంట్స్ తో బిజీగా వున్నాడు..దింతో పూజా కార్యక్రమంకు హాజరు కాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నానే హీరోయిన్‌గా నటించనుంది..త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *