DEVOTIONAL

జనవరి 28న తిరుమ‌ల‌లో రథసప్తమి– ఒకే రోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం

తిరుమల: సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది.ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

 వాహనసేవల వివరాలు :

ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం      

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం          

ఉదయం 11 నుంచి 12 గంటల వరకు – గరుడ వాహనం              

మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం    

మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు –  కల్పవృక్ష వాహనం        

సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం    

రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం        

ఆర్జిత సేవలు రద్దు :- పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *