AMARAVATHI

రాయలసీమ కొందరి కబంధ హస్తాల్లో ఉండిపోయింది-పవన్ కల్యాణ్

అమరావతి: చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం సాయంత్రం జనసేనలో చేరారు.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానించారు.. ఈసందర్బంలో పార్టీ కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి అయన మాట్లాడుతూ “పార్టీలు మారినప్పుడుల్ల మాట మార్చేవారు నాకు అవసరం లేదు,,మాట మీద నిలబడే వారే నాతో వుంటారని కాపు సంఘ నాయకుడు ముద్రగడ పధ్మనాభం గురించి,జోగయ్య గురించి పరోక్షంగా ప్రస్తవించారు.. ‘మొన్నటిదాకా నాకు అలా చేయ్, ఇలా చేయ్ అని చాలా మంది సలహాలు ఇచ్చారు.. నాకు సీట్లు తీసుకోవడం, ఇవ్వడం తెలియదా? నాకు సలహాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నారు.. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి.” అంటూ పవన్ కల్యాణ్ చురకలు వేశారు..

రాయలసీమతో నాకిదే సమస్య. తొడగొట్టడాలు నాకు తెలీదు. మీరు కొడితేనే రక్తం వస్తుందా..? మేం కొడితే రక్తం రాదా..? మేం కొడితే కాళ్లు.. కీళ్లు విరగవా..? ఆరణి శ్రీనివాస్ నాకు 2008 నుంచి పరిచయం.. కొద్దిపాటి ఓట్ల తేడాతో 2009లో ఆరణి ఓడించబడ్డారు.. ఏమీ ఆశించకుండా పార్టీలో పని చేయడానికి ఆరణి సిద్దపడ్డారు. చిత్తూరు జిల్లా ఓ ఐదుగురు చేతుల్లోనే ఉంది.. పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి మీద నాకేం శతృత్వం లేదు.. రాయలసీమ కొద్ది మంది చేతుల్లోనే బందీ అయిందనే బాధ నాకుంది..

2019లో నేను ఓడిపోయిన సమయంలో ప్రీతి తల్లి వచ్చి నన్ను కలిసింది.. తన లాంటి వారి కోసం నన్ను నిలబడాలని కోరింది..నన్ను కర్నూలు రావాలని ఆహ్వానించింది.. నేను కర్నూలు వెళితే లక్షన్నర మంది జనం వచ్చి సుగాలి ప్రీతి తల్లికి మద్దతు తెలిపారు.. జనసేన ఒత్తిడి కారణంగానే సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇచ్చారు..రాయలసీమలో నిరసన తెలపాలని వస్తే మద్దతిస్తున్నారు… కానీ ఎన్నికల సమయంలో మాత్రం భయపడుతున్నారు… ఈ నేల పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి ది కాదు.. రాయల వారు ఏలిన నేల రాయలసీమ…ఊర కుక్కలను కుందేలు తరిమిన నేల రాయలసీమ. అలాంటి ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో ఉండిపోయింది” అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

7 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

11 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

15 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

1 day ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 day ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

1 day ago

This website uses cookies.