డీఆర్డీఓ కొత్త ఛైర్మన్గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్

రక్షణశాఖ మంత్రికి..
అమరావతి: రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(DRDO) కొత్త ఛైర్మన్గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం..కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ పరిశోధన,,అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన కామత్ DRDO ఛైర్మన్గానూ విధులు నిర్వహించనున్నారు.. DRDOలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్గా అయన పనిచేస్తున్నారు.ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత కామత్కు 60 సంవత్సరాలు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారని DRDO అధికారులు తెలిపారు.
ప్రస్తుతం DRDO ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న జి.సతీశ్ రెడ్డి(నెల్లూరుజిల్లా) కేంద్ర రక్షణశాఖ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులైనట్లు తెలుస్తుంది. అగ్రశ్రేణి రక్షణ శాస్త్రవేత్తగా పేరున్న డాక్టర్ సతీష్,,అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థల కోసం నావిగేషన్, ఏవియానిక్స్ డిజైన్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు..2018లో సతీశ్ రెడ్డి DRDO ఛైర్మన్గా నియమితులయ్యారు.2020లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది..