NATIONALTECHNOLOGY

డీఆర్​డీఓ కొత్త ఛైర్మన్​గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్

రక్షణశాఖ మంత్రికి..

 అమరావతి: రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(DRDO) కొత్త ఛైర్మన్​గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం..కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ పరిశోధన,,అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన కామత్ DRDO ఛైర్మన్​గానూ విధులు నిర్వహించనున్నారు.. DRDOలో నేవల్ సిస్టమ్స్ అండ్​ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్‌గా అయన పనిచేస్తున్నారు.ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత కామత్‌కు 60 సంవత్సరాలు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారని DRDO అధికారులు తెలిపారు.

ప్రస్తుతం DRDO ఛైర్మన్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న జి.సతీశ్​ రెడ్డి(నెల్లూరుజిల్లా) కేంద్ర రక్షణశాఖ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులైనట్లు తెలుస్తుంది. అగ్రశ్రేణి రక్షణ శాస్త్రవేత్తగా పేరున్న డాక్టర్ సతీష్​,,అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థల కోసం నావిగేషన్, ఏవియానిక్స్ డిజైన్‌ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు..2018లో సతీశ్​ రెడ్డి DRDO ఛైర్మన్​గా నియమితులయ్యారు.2020లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *