DISTRICTS

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సదారావు

నెల్లూరు: జిల్లా సమాచార పౌర సంబంధాల(DIPRO) అధికారిగా కె.సదారావు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇంచార్జి DPROగా ఉన్నటువంటి ఎ రమేష్  వద్ద నుండి చార్జ్ తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.అలాగే జిల్లా ఇంచార్జి కలెక్టర్ రోణంకి.కూర్మనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడ సమాచార పౌర సంబంధాల శాఖ, కమీషనర్ వారి కార్యాలయంలో ఉప సంచాలకులుగా పనిచేస్తూ బదిలీ పై నెల్లూరు DIPROగా విధుల్లో చేరారు.ఈ సందర్బంగా సదారావు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రభుత్వం పేద, బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్న నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను, గడపగడపకు మన ప్రభుత్వం  తదితర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఐపిఆర్వోకు కార్యాలయ సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ పిఆర్ఓ రమేష్, ఏపీఆర్ఓ రవీంద్ర, పిఆర్వో వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *