ఢిల్లీ మద్యం స్కాంలో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి
అమరావతి: ఢిల్లీ మద్యం స్కాంలో నిందితుడిగా నిన్నటి వరకు జైల్లో వున్నశరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న ఈయన గురువారం (01-06-2023) రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు..శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారని,,ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ ఈడీ కూడా కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం జరిగింది..శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ పిటీషన్ ను కోర్టు అనుమతి ఇచ్చింది..ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇది పెద్ద మలుపుగా భావించవచ్చు..గతంలోనే ఎమ్మెల్సీ కవితకు ఆడిటర్ గా పనిచేసిన బుచ్చిబాబు సైతం అప్రూవర్ గా మారారు..ప్రముఖ ఫార్మాకంపెనీ అరబిందో ఫార్మాకు డైరెక్టర్ గా ఉన్నశరత్ చంద్రారెడ్డి 2022, నవంబర్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన్ను అరెస్ట్ అయ్యారు..