CRIMENATIONAL

షాపూర్‌జీ-పల్లోంజీ గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి  

అమరావతి: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ షాపూర్‌జీ-పల్లోంజీ గ్రూప్  ప్రస్తుత చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో  ప్రాణాలు కోల్పోయారు..మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్​ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో సూర్యా నది వంతెన దగ్గర ఆయన కారు డివైడర్​ను ఢీకొట్టడడంతో ప్రమాదం జరిగిందని పాల్ఘర్​ ఎస్పీ వెల్లడించారు.మెర్సిడెస్​ కారులో మిస్త్రీ అహ్మదాబాద్​ నుంచి ముంబయి వెళ్తున్నట్లు తెలుస్తుంది.ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో సహా కారులో డ్రైవర్​, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని,,మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా స్పాట్​లోనే చనిపోయారని పోలీసులు వెల్లడించారు..గాయాలైన ఇద్దరిని,,చికిత్స నిమిత్తం పోలీసులు గుజరాత్​లోని ఆస్పత్రికి తరలించారు..మిస్త్రీ మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాలు,,ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *