AMARAVATHI

శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 17 నుంచి వచ్చేనెల 19 వరకు శ్రావణ మాసోత్సవాలు

అమరావతి: శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 17వ తేది నుంచి వచ్చేనెల 19వ తేది వరకు శ్రావణ మాసోత్సవాలు జరుగనున్నాయని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న వెల్లడించారు..శ్రావణ మాసోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాల మధ్య శ్రీశైలం దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు..క్యూ కాంప్లెక్స్,, దర్శనం క్యూ లైన్లు,, అర్జిత సేవా క్యూ లైన్లు,,శీఘ్ర దర్శనం,,అతి శీఘ్ర దర్శనం క్యూ లైన్లు,,విరాళాల సేకరణ కేంద్రం వద్ద వసతులను ఈవో లవన్న పరిశీలించారు..శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం, వివిధ ఆర్జిత సేవలకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని,, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనాలకు కూడా వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు..భక్తుల రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి వచ్చే నెల 15 వరకు (శ్రావణ మాసం ముగిసే వరకూ) వచ్చే శని, ఆది, సోమవారాలు, పర్వదినాలు, స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), వరలక్ష్మి వ్రతం (ఆగస్టు 25), శ్రావణ పౌర్ణమి (ఆగస్టు 31), శ్రీ క్రుష్ణాష్ణమి (సెప్టెంబర్ 6) పర్వ దినాల్లో శ్రీ స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలిపివేశారు..అభిషేకాలు నిలిపేయడంతో ఈ నిర్దారిత రోజుల్లో రూ.500 ఫీజుతో శ్రీ స్వామి వార్ల స్పర్శ దర్శనానికి అనుమతి ఇచ్చారు.. ప్రతి రోజూ నాలుగు విడతలుగా స్పర్శ దర్శనం కల్పిస్తారు..ప్రస్తుతం కొనసాగుతున్న విధంగానే భక్తులు స్పర్శ దర్శనం టికెట్లు,,ఆర్జిత సేవా టికెట్లు ఆన్ లైన్ లోనే దేవస్థానం వెబ్ సైట్ నుంచి పొందాల్సివుంటుందని,,దేవస్థానం యాప్ నుంచి భక్తులు మరింత సులభతరంగా టికెట్లు పొందవచ్చన్నారు.. టికెట్ల లభ్యతను బట్టి ఒక గంట ముందు వరకూ ఆన్ లైన్ లో భక్తులు ఆయా టికెట్లు పొందేందుకు వీలు కల్పిస్తున్నది దేవస్థానం..ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు విధిగా ఆన్ లైన్ టికెట్ ప్రింట్ కాపీ వెంట తెచ్చుకోవాలి. ఆన్ లైన్ ద్వారా పొందిన టికెట్లు స్కాన్ చేసిన తర్వాతే ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారికి అనుమతి ఇస్తారు..ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు తీసుకున్న వారు ఆధార్ కార్డు గుర్తింపు ప్రతి (ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీ) వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది..ఆధార్ గుర్తింపు ప్రకారమే ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారిని అనుమతిస్తారు..భక్తులు టికెట్ ప్రింట్ కాపీ, ఆధార్ కార్డు ఒరిజినల్ తోపాటు ఆధార్ జీరాక్స్ కాపీ వెంట వుంచ్చుకోవాలి.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

3 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

20 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

23 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

24 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

1 day ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.