HYDERABAD

ప్రత్యేక రైళ్లను మరో నెల రోజుల పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే  

హైదరాబాద్: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే,, ప్రయాణీకుల సౌకర్యర్ధం సికింద్రాబాద్-మదురై మధ్య నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లను మరో నెల రోజుల పాటు పొడగిస్తున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు..సికింద్రాబాద్- మదురై ప్రత్యేక రైలు (నెం.07191)ను ఆగస్టు 29 తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు..ఈ ప్రత్యేక రైలు ప్రతి సోమవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్తుంది..అలాగే మదురై-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (నెం.07192)ను ఆగస్టు 31 తేదీ నుంచి సెప్టెంబర్ 28 తేదీ వరకు పొడగిస్తున్నట్లు పేర్కొన్నారు..ఈ రైలు ప్రతి బుధవారం మదురై నుంచి బయలుదేరి సికింద్రాబాద్ వస్తుంది..అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు..సదరు వివరాలు ఇలా వున్నాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *