ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి-కలెక్టర్
నెల్లూరు: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక వసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో నెల్లూరు సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే ఆస్పత్రిలో ఉన్న స్క్రాప్ సామాగ్రిని టెండర్లు పిలిచి ఈ నెలాఖరులోగా విక్రయించాలన్నారు. అవసరమైన పరికరాలకు మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సీసీ కెమెరాలు, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కు నూతన అగ్రిమెంట్లు తయారుచేసి సంబంధిత ఏజెన్సీలను నియమించాలన్నారు. రోగులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని సదుపాయాలను సకాలంలో సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో GGH సూపరింటెండెంట్ సిద్ధానాయక్, AP MSIDC EE విజయ భాస్కర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మురళీకృష్ణ,, డాక్టర్ గీతా లక్ష్మి, కమిటీ కోఆర్డినేటర్ సునంద లక్ష్మి, సభ్యులు అభిషేక్, శ్రీనివాసులురెడ్డి, వీరభద్రారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.