DISTRICTSSPORTS

మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా క్రీడా పోటీలు-సిఇఓ పుల్లయ్య

నెల్లూరు: హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా అగష్టు 29వ తేదిన జాతీయ క్రీడా దినొత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని జిల్లా క్రీడాప్రాధికారసంస్థ సిఈఓ పుల్లయ్య తెలిపారు.ఈ సందర్బంను పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికారా సంస్థ,ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో 5 క్రీడాంశంల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.1.హాకీ(మహిళలు,పురుషులు),,2.పూట్ బాల్(పురుషులు),, 3.అథ్లెటిక్స్(మహిళలు,పురుషులు),, 4.బ్యాక్సింగ్(బాలురు,బాలికలు),, 5.రెజ్లింగ్(పురుషులు) విభాగాల్లో పోటీలను,ర్యాలీను నిర్వహిస్తామన్నారు.క్రీడా పోటీల్లో విజేతలగా నిలిచిన క్రీడాకారులకు జాతీయక్రీడా దినొత్సవం సాయంత్రమే బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు.ఉత్సహం,ఆశక్తి వున్న క్రీడాకారులు పైన తెలిపిన క్రీడాంశాలకు సంబంధించిన క్రీడాకారులు/టీములు 29వ తేది ఉదయం 8 గంటలకు హాజరై పేర్లను నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొన్నాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *