AMARAVATHIDISTRICTSPOLITICS

పట్టభద్రుల MLCగా జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ నుంచి డిక్లరేషన్ అందుకున్న కంచర్ల శ్రీ కాంత్

చిత్తూరు: ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు  నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ప్రాధాన్యతా ప్రకారం ఓట్ల లెక్కింపులో  కంచర్ల శ్రీకాంత్ కు ఎన్నికల కమిషన్ ప్రకటనతో డిక్లరేషన్ అందించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్, చిత్తూరు యం.హరి నారాయణన్ తెలిపారు..శనివారం ఉదయం స్థానిక ఆర్ వి యస్ ఇంజనీరింగ్ కళాశాలో 16 నుంచి నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో,కంచర్ల శ్రీకాంత్ డిక్లరేషన్ అందుకున్నారు.ఈ నెల 16న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 8 గం.ల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై 18 న ఉదయం 2 గం.ల వరకు కొన సాగిన ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియతో తన సమీప అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్నాటి  పై 34,110 ఓట్ల ఆధిక్యంతో కంచర్ల శ్రీకాంత్ గెలుపొందడంతో ఎన్నికల కమిషన్ జారీ చేసిన డిక్లరేషన్ ను అందుకున్నారు.. ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యతా ప్రక్రియ విధానంతో మొత్తం 2,48,360 ఓట్లకు గానూ కంచర్ల శ్రీకాంత్  కు 1,24,181  ఓట్లు, శ్యామ్ ప్రసాద్ పెర్నాటి కి 90,071 ఓట్లు రావడం జరిగింద ని తెలిపారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్ డిక్లరేషన్ అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.    

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *