డిసెంబర్ 12న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల: 2023 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 12న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా, 2023 జనవరి నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ డిసెంబర్ 12న ఉదయం 10 గంటల నుంచి డిసెంబరు 14వ తేది ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత లక్కీడిప్ లో టికెట్లు కేటాయిస్తారు. భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.