జీవో నంబర్ 1పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి: రోడ్ షోలు,,రోడ్డుపై సభలు, సమావేశాలను నియంత్రిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ,, శుక్రవారం పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు, ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్ 1పై జోక్యం చేసుకోలేమని చెప్పింది..ఈ నెల 23వ తేదిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ కేసును విచారించాలని ఆదేశించింది.. హైకోర్టు ముందే అన్ని అంశాలను ప్రస్తావించాలని సూచించింది.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మెరిట్స్ పై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని స్పష్టం చేసింది..