x
Close
BUSINESS NATIONAL

ముకేశ్​ అంబానీ భద్రతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ముకేశ్​ అంబానీ భద్రతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
  • PublishedJuly 22, 2022

అమరావతి: భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త,,అపర కుబేరుడు ముకేశ్​ అంబానీ భద్రత విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ,,అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను కొనసాగించడానికి కేంద్రానికి అనుమతి ఇచ్చింది..శుక్రవారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది….ముకేశ్​ అంబానీ కుటుంబానికి కల్పించిన భద్రతను సవాల్​ చేస్తూ,, బికేశ్​ సాహా అనే వ్యక్తి త్రిపుర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు..విచారణ చేపట్టిన త్రిపుర హైకోర్టు రెండుసార్లు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది…అంబానీ, ఆయన భార్య, పిల్లలకు పొంచి ఉన్న ముప్పు, అంచనా నివేదికపై కేంద్ర హోంశాఖ వద్ద ఉన్న ఒరిజినల్​ పత్రాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది..ఆ ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు,,నేడు భద్రత కొనసాగింపుపై స్పష్టత ఇచ్చింది..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.