AMARAVATHICRIME

రాహుల్ గాంధీకి రెండేళ్ల  జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

అమరావతి: 2019లో ప్రధాన మంత్రి “మోడీ” ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయుకుడు రాహుల్ గాంధీకి, గుజరాత్ లోని సూరత్ కోర్టు నేడు రెండేళ్ల  జైలు శిక్ష విధించింది..పరువు నష్టం కేసులో IPC సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని దోషిగా పేర్కొంది..2019 సాధారణ ఎన్నికల సందర్బంగా కర్నాటకలోని కోలార్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా, దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ కామెంట్స్ చేశారు..ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే,, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోడీ సూరత్ కోర్టులో కేసు వేశారు..రెండు సంవత్సరాల విచారణ అనంతరం వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది..దింతో గురువారం (మార్చి 23వ తేదీ) సూరత్ కోర్టులో రాహుల్ గాంధీ హాజరయ్యారు..ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని,,సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని నిర్థారించిన కోర్టు,,రాహుల్ గాంధీకి u/s 499, 500  IPC  కింద రెండేళ్ల జైలు శిక్ష విధించింది..జైలు శిక్ష తీర్పు సమయంలో కోర్టులోనే ఉన్న రాహుల్ గాంధీ,,కోర్టు శిక్ష విధించడంతో షాక్ అయ్యారు..ఇదే సమయంలో సూరత్ కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది..శిక్షకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అప్పీల్ మేరకు కోర్టు అతనికి 30 రోజుల బెయిల్‌ ను మంజూరు చేసింది..అప్పటి వరకు ఈ శిక్షను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *