NATIONAL

షాహీ ఈద్గా వివాదాస్పద స్థలంలో సర్వే చేయండి-మధుర కోర్టు

అమరావతి: ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదాస్పద స్థలంలో సర్వే చేయాలని మధుర కోర్టు శనివారం ఆదేశించింది. హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీనియర్ డివిజన్ కోర్టు ఈ కేసులోని అన్ని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని కోరింది..మధురలో కత్రా కేశవ్ దేవ్ ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఎన్నో హిందూ సంస్థలు కోర్టులో కేసులు దాఖలు చేశాయి.. హిందూ సేన సంస్థ జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా కూడా పిటిషన్ వేశారు..శ్రీ కృష్ణ పరమాత్ముడు జన్మించిన ప్రదేశంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారని పిటిషనర్ విష్ణు గుప్తా ఆరోపించారు..మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాలతో 1669-1670 సంవత్సరాల  మధ్యకాలంలో కత్రా కేశవ్ దేవ్ ఆలయ పరిసరాల్లోని 13.37 ఎకరాల స్థలంలో షాహీ ఈద్గా మసీదును కట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు..ఈ మేరకు అభియోగాలతో పిటిషనర్ విష్ణు గుప్తా తరపు న్యాయవాది శైలేశ్ దూబే ఈ ఏడాది డిసెంబరు 8వ తేదిన  కోర్టులో వాదనలు వినిపించారు..శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్,, షాహీ ఈద్గా మసీదు కమిటీ మధ్య 1968  సంవత్సరంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు..ఆ అగ్రిమెంట్ అన్యాయమైందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు..ఈ వాదనల నేపథ్యంలోనే మధురలోని ఓ కోర్టు తాజా ఆదేశాలను జారీ చేస్తూ,,ఈ సర్వే నివేదికను జనవరి 20న సమర్పించాలని ఆదేశించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *