x
Close
INTERNATIONAL

శ్రీలంకకు సాయం చేసి,ప్రాణం పోసిన భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు-విక్రమసింఘే

శ్రీలంకకు సాయం చేసి,ప్రాణం పోసిన భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు-విక్రమసింఘే
  • PublishedAugust 3, 2022

అమరావతి: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అన్ని విధాలా దెబ్బతిన్న సమయంలో భారతదేశం చేసిన సహాయం మరువలేనిదని శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు..కష్టకాలంలో శ్రీలంకకు సాయం చేసి, ప్రాణం పోసిన ప్రధాని మోడీకి, తన తరపున,.దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.. ప్రధాని మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం, ద్వీప దేశమైన శ్రీలంకకు ప్రాణవాయువు అందించిందని రణిల్ విక్రమసింఘే పార్లమెంట్‌లో అన్నారు.. గతవారం  విక్రమసింఘేను, ప్రధాని మోడీ అభినందనలు తెలియచేస్తు,,ఆర్థిక పునరుద్ధరణకు శ్రీలంక ప్రజలకు భారతదేశం మద్దతు ఎప్పుడూ ఉంటుందని,, ఆర్థిక సంక్షోభం నుంచి కొత్త అధ్యక్షుడు దేశాన్ని విజయపథంలో నడిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు..2022 జనవరి నుంచి శ్రీలంకకు, భారత ప్రభుత్వ దాదాపు 4 బిలియన్ డాలర్ల సాయం అందించింది..ప్రస్తుత శ్రీలంకలో నెలకొని వున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి,,ఆర్థిక సహాయంపై ఆ దేశం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF),ఇతర విదేశీ దేశాలతో చర్చలు జరుపుతోంది.. విక్రమసింఘే తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి శ్రీలంక దీర్ఘకాలిక పరిష్కారాల వైపు వెళ్లాలని అన్నారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.