కర్ణాటకలో విజయకేతనం ఎగురువేసిన కాంగ్రెస్
అమరావతి: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురువేసింది..ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ముగిసింది..ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 136 స్థానాలతో విజయం సాధించింది..బీజేపీ 65,, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాలతో సరిపెట్టుకున్నారు.. 224 స్థానాలకు ఎన్నికలు జరగగా మొత్తం 73.19శాతం పోలింగ్ నమోదైంది..ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 113 మేజిక్ ఫిగర్..ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అధిక్యం రావడంతో,,మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య,,కర్ణాటక పీసీసీ అధ్యక్షడు శివకుమార్ లు సీ.ఎం కూర్చీ కోసం ఆట మొదలైంది..అలాగే తమ పార్టీ ఎమ్మేల్యేలు ఎక్కడ చేజారిపోతారో అన్న భయంతో,,కాంగ్రెస్ ఎమ్మేల్యేను,,హైదరాబాద్ కు తరలించి క్యాంపు రాజకీయ మొదలు పెట్టారు..రేపటి నుంచి ఎలాంటి రాజకీయ ఆట మొదలు అవుతుందో వేచి చూడాలి.
విజయంపై మోడీ అభినందనలు:- కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. విజయంపై మోడీ అభినందనలు తె లియజేశారు. కర్ణాటక అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.