భారత్ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఈజిప్ట్ ఆర్మీ

అమరావతి: మొదటి సారిగా భారత దేశ గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ ఆర్మీ పాల్గొంది..ఈజిప్ట్ సైన్యం ఈ వేడుకల్లో మార్చ్ నిర్వహించింది.. కల్నల్ మొహమూద్ మొహమ్మద్ ఫత్తా ఎల్ ఖరాసావి ఆధ్వర్యంలోని 144 మంది ఈజిప్టు సైనికులు వారి సైనిక యూనిఫాం ధరించిన సిబ్బంది పరేడ్ నిర్వహించారు..ఈజిప్ట్ అధ్యక్షుడు గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి..ఈజిప్ట్ అధ్యక్షుడిని వేడుకలకు ఆహ్వానించడం ద్వారా భారత్,ఈజిప్ట్ దేశంతో సంబంధాల్ని మెరుగుర్చుకోవాలని ఇండియా భావిస్తొంది..వ్యాపార, వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని,,భారత దేశం భావిస్తోంది..రాబోయే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 12 బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రణాళికగా నిర్ణయించింది..ఆహారం, ఫార్మా, ఇతర రంగాల్లో సహకారానికి సంబంధించి ఇరు దేశాధినేతలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు..ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం విస్తరిస్తుండటంపై భారతదేశ ప్రధన మంత్రి మోదీ,,ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఆందోళన వ్యక్తం చేశారు..సరిహద్దు తీవ్రవాదాన్ని అంతమొందించే విషయంలో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని భారత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.