DISTRICTS

పట్టభద్రులు,ఉపాధ్యాయ ఎన్నికకు సంబంధించి తుది జాబిత డిశంబరు 30న ప్రచురణ-కలెక్టర్

నెల్లూరు: ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 76 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ హాల్లో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులు ఉన్నటువంటి కళాశాలలు, పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసినట్టుగా తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రo ను ఏర్పాటు చేసామన్నారు. పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఆత్మకూరు, బుచ్చి, కొవూరు, పొదలకూరు, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి మండలాలలో రెండు పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా కందుకూరు – 4, కావలి – 6, నెల్లూరు అర్బన్ – 9, నెల్లూరు రూరల్ – 19 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 7వ తేది నాటికి జిల్లాలో పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి 1,13,837 మంది, ఉపాధ్యాయ ఎన్నికకు సంబంధించి 7,783 మంది ఓటర్లుగా నమోదుకు దరఖాస్తులు సమర్పించారన్నారు. వాటిని పరిశీలించి ఈ నెల 19వ తేది నాటికి డ్రాఫ్ట్ తయారి పూర్తిచేసి, 23వ తేదిన ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితా ప్రచురిస్తామని, వాటిపై అభ్యంతరాలను డిశంబర్ 9 వరకు స్వీకరిస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను డిశంబర్ 25 నాటికి పరిష్కరించి, తుది జాబితాను డిశంబర్ 30న ప్రచురిస్తామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *