x
Close
AMARAVATHI

రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం-వాతావరణ శాఖ

రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం-వాతావరణ శాఖ
  • PublishedOctober 6, 2022

అమరావతి: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని అయితే కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది.అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా  దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.నిన్నటి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దసరా రోజున కురిసిన వర్షంతో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు, గుంటూరు, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.