అమరావతి: సంజయ్ సింగ్ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాడీని సస్పెండ్ చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది..బీజేపీ ఎంపీ, మాజీ WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ WFI కొత్త అధ్యక్షుడుగా ఎన్నిక కావడంపై నిరసలకు దారితీసింది..ఇదే సమయలో అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే ఆయన ఈ ఏడాది చివర్లో గోండా (యూపీ)లోని నందిని నగర్లో నేషనల్స్ జరుగుతాయని ప్రకటించారు..ఈ ప్రకటనను తొందరు పాటు చర్యగా,, రెజ్లర్లకు తగిన నోటీసు ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయంగా క్రీడల మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.. WFI ప్యానెల్ పూర్తిగా మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో ఉన్నట్టు,, స్పోర్ట్స్ కోడ్ ను పూర్తిగా ఆతిక్రమంచినట్లు కనిపిస్తోందని క్రీడల మంత్రిత్వ శాఖ పేర్కొంది..మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో ఫెడరేషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని భావించాల్సి వస్తోందని,, గతంలో క్రీడాకారులు లైంగిక వైధింపులను ఎదుర్కొన్నట్టు చేసిన ఆరోపణల అంశం ప్రస్తుతం కోర్టు విచారణ ముందు ఉందని వెల్లడించింది..సంజయ్ సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ బాడీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు..సంజయ్ సింగ్ గత గురువారంనాడు WFI కొత్త అధ్యక్షుడిగా 47 ఓట్లకు 40 ఓట్లు గెలుచుకుని సంచలన విజయం సాధించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.