x
Close
NATIONAL

జమ్మూ కశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే నిర్మాణం పూర్తి

జమ్మూ కశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే నిర్మాణం పూర్తి
  • PublishedAugust 10, 2022

ఈ నెల 13న…

అమరావతి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెల 13న ప్రారంభం కానుంది.. 476 మీటర్ల పొడవులో 359 మీటర్ల ఎత్తులో విల్లు ఆకారంలో నిర్మించిన రైల్వే బ్రిడ్జీ ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించనుంది..ఈ రైల్వే వంతెన ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది..ఉధంపూర్-శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్  ప్రాజెక్ట్ కింద కత్రా, బనిహాల్ మధ్య 111 కి.మీల మార్గంలో ఈ వంతెన కీలకమైనది..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణంలో 28,660 మెట్రిక్ టన్నుల స్టీల్ను ఉపయోగించారు.. బ్రిడ్జి  మొత్తం బరువు 10,619 మెట్రిక్​ టన్నులు కాగా నిర్మాణంలో 17 పిల్లర్లను ఉపయోగించారు..ఈ వంతెన నిర్మాణానికి ఉపయోగించే స్టీల్ 10 డిగ్రీల సెంటిగ్రేడ్​ నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటుంది..గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకునేలా రూపొందించారు..ఈ ప్రాంతంలో ఉగ్రవాద ముప్పును దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా ప్రణాళిక రూపొందించారు..అలాగే దేశంలోనే అత్యధిక తీవ్రత కలిగిన వీజోన్​ భూకంపాలను కూడా బ్రిడ్జ్ తట్టుకుని నిలబడగలదు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.