CRIME

2 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ను మాయం చేసిన దొంగలు

అమరావతి: ప్రభుత్వ ఆస్తులైన,,ప్రవేట్ ఆస్తులైన మనకు ఒకటే,,వాడకుండా ప్రక్కన పెడితే,,మాయం చేయడంలో ముందు వుంటామంటూన్నారు..గత సంవత్సరం మొబైల్ టవర్, రైల్ ఇంజన్‌ను ఎత్తుకుపోయిన దొంగలు ఈసారి ఏకంగా రైల్వే ట్రాక్‌నే ఎత్తుకుపోయారు..బీహార్‌లోరి సమస్టిపూర్ జిల్లాలో సుమారు 2 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ను దొంగలు మాయం చేశారు..దీంతో బిత్తరపోవడం పోలీసుల వంతయింది..పోలీసులు తెలిపిన వివరాల ఇలా వున్నాయి.. పాండైల్ రైల్వే స్టేషన్ నుంచి లోహత్ షుగర్ ఫ్యాక్టరీకి అనుసంధానంగా ఈ రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను ఉపయోగిస్తున్నారు..గత కొన్ని సంవత్సరాలుగా షుగర్ మిల్లు పనిచేయకపోవడంతో ఈ ట్రాక్ వినియోగంలో లేదు..ఈ విషయంను పసికట్టిన దొంగలు రైల్వే ట్రాక్‌ను వాయిదాల పద్దతిపై మాయం చేసి,, దానిని స్క్రాప్ డీలర్లకు అమ్మేశారు.. ఈ నేరంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న రైల్వే ఉన్నతాధికారులు ఇద్దరు ఆర్‌పీఎఫ్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఎఫ్ఐఆర్‌ను ఆర్పీఎఫ్ నమోదు చేసింది. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు పేర్కొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *