అమరావతి: ఉత్తర ప్రదేశ్లో బ్యాంకులోకి సొరంగం ద్వారా ప్రవేశించి రూ.కోటి విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్, కాన్పూర్లోని SBI Bank భానూతి బ్రాంచ్ చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి… భానూతి బ్రాంచ్ ప్రక్కనే వున్న ఖాళీ స్థలం నుంచి దొంగలు బ్యాంకులోకి దాదాపు 10 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో సొరంగం తవ్వి,,ఈ సొరంగం నుంచి బ్యాంక్ ఫ్లోర్ పగులగొట్టి,, బ్యాంకులోకి ప్రవేశించారు..స్ట్రాంగ్ రూమ్ లోని బీరువాల్లో వున్న రూ.1 కోటి విలువైన 1.8 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు..క్యాష్ ఉన్న లాకర్స్ ను పగలగొట్టేందుకు కూడా ప్రయత్నించినట్లు ఆధారలు దొరికాయి..అయితే ఇది సాధ్యం కాలేదు..ఈ దొంగతనం గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు..శుక్రవారం ఉదయం బ్యాంకుకు వచ్చి సిబ్బంది,,రూమ్ లోకి వెళ్లే సరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు..వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.,బ్యాంకులో ఎంత బంగారం చోరీకి గురైంది,, దాని విలువెంత అని తెలుసుకోవడానికి సిబ్బందికి ఒక రోజు సమయం పట్టింది..దొంగలు పట్టుకెళ్లిన బంగారం 29 మంది కస్టమర్లకు సంబంధించిందని,, బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారని బ్యాంక్ మేనేజర్ తెలిపారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు..దొంగతనం జరిగిన తీరు గమిస్తే,, బ్యాంకు గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు..ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు,, స్ట్రాంగ్ రూమ్ నుంచి సేకరించిన వేలి ముద్రల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు..