CRIMEHYDERABAD

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా మృతి

అమరావతి: మావో కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా గ్రేహౌండ్స్ బలగాల చేతిలో ఎన్ కౌంటర్ కు గురయ్యాడు.. మావోయిస్టు లకు పోలీసులు మధ్య జరిగిన ఏదురు కాల్పుల్లో హిడ్మా చనిపోయినట్టు అధికారులు తెలిపారు.. బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది..తెలంగాణ గ్రేహౌండ్స్,, సీఆర్పీఎప్ కోబ్రా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం..40 ఏళ్ల లోపు వయసున్న హిడ్మాకు మావోయిస్టుల్లో మాస్టర్ మైండ్‌గా గుర్తింపు ఉంది..17 సంవత్సరాల వయస్సులో మావోయిస్టుల్లో చేరిన హిడ్మా,,కొద్దికాలానికే కేంద్ర కమిటీ స్థాయికి చేరుకున్నట్టు చెబుతారు..5వ తరగతి వరకు చదుకున్న హిడ్మా, ఇంగ్లీష్‌తో పాటు గిరిజన మాండలికాలు, దేశంలోని అనేక ప్రాంతీయ భాషలలో నిష్ణాతుడని వినికిడి..అతడిని హిడ్మాలు, సంతోష్ అని కూడా పిలుస్తారు..హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా బెటాలియన్ నంబర్ వన్‌కు నాయకత్వం వహిస్తున్నాడు..అడవిలో దాక్కున్నాడని పక్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు..పోలీసుల రాకను గుర్తించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు..వీరికి ధీటుగా పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో హిడ్మా హతమయ్యాడు..ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మాపై రూ.45 లక్షలు రివార్డ్ ఉంది.. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *