NATIONAL

భారతదేశంలో మూడు చరిత్మకమైన ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు

అమరావతి: భారతదేశంలో మరో మూడు చరిత్మకమైన ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించింది..ప్రధాని నరేంద్ర మోడీ జన్మ స్థలం గుజరాత్ లోని వాద్ నగర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఆన్‌కోర్‌వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ (రాతి శిల్పాలు) మొతెరాలోని సూర్య దేవాలయాలకు ఈ గౌరవం దక్కింది.,భారత్‌లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్‌) జాబితాలో చేర్చుతున్నట్లుగా ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ANI) ప్రకటించింది..ఈ మూడు ప్రదేశాల చిత్రాలనూ కేంద్ర పర్యటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్‌ ద్వారా అభినందనలు తెలిపారు..వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాకు ఈ మూడు ప్రదేశాలను భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే నామినేషన్లను అన్నికోణాల్లోను పరిశీలిస్తుంది..వాటి వెనుక ఉన్న చరిత్ర,,ఏకాలం నాటివి,,వాటికి ఉండే ప్రాముఖ్యత,,సాంస్కృతికం వంటి అన్ని విషయాలను పరిశీలించిన మీదట తగిన అర్హతలు ఉన్న వాటికి జాబితాలో చోటు కల్పిస్తుంటుంది..ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన భారత్ లోని మరిన్ని స్మారక చిహ్నాలు,, ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కాల్సి ఉంది..ఈక్రమంలో తాజాగా చేర్చిన ఈ మూడు ప్రదేశాలతో కలిపి ప్రపంచ వారసత్వ కట్డడాలు,, ప్రదేశాల జాబితాలో భారత్ నుంచి చేరిన వాటి సంఖ్య 52కు పెరిగింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *