విచారణలో ఎందుకు జాప్యం-తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీ
అమరావతి: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సోమవారం విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం,, సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది..విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని సీబీఐని నిలతీసింది..వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేశారు..దీనిపై విచారణ నిర్వహించిన సుప్రీమ్ కోర్టు వివేకా హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది..కేసు అంతా… రాజకీయ దురుద్దేశ్యంతో కూడినదేనని రిపోర్ట్ లో రాశారని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నారు..హత్యకు గల ప్రధాన కారణాలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది..విచారణాధికారిని మార్చాలని లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది..అలాగే ఇప్పుడున్న అధికారి కూడా కొనసాగుతారని తెలిపింది..తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.