పేదలకు వైద్యసేవలు సకాలంలో అందించేందుకు104,108 వాహనాలు-కలెక్టర్
నెల్లూరు: పేదలకు మెరుగైన వైద్యసేవలు సకాలంలో అందించడమే లక్ష్యంగా వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూడుతోందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లాకు నూతనంగా మంజూరైన ఏడు 104 అంబులెన్స్ లను జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర, నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు104,108 వాహనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, ప్రధానంగా గ్రామీణ ప్రజలకు 104,108 సేవలు సకాలంలో అందుతున్నాయన్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన వైద్యశాల అందించేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని, జిల్లాలో 104 వాహనాలు 37 సేవలందిస్తుండగా, తాజాగా మరో ఏడు నూతన వాహనాలను జిల్లాకు కేటాయించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పెంచలయ్య, జడ్పీ సీఈవో చిరంజీవి, 104, 108 అంబులెన్స్ ల జిల్లా మేనేజర్ పవన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.