AMARAVATHI

ఏప్రిల్ 3 నుంచి 18వ వరకు 10వ తరగతి పరీక్షలు

అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేది నుంచి 18వ తేది వరకు 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి..పరీక్షల సమయంలో ఒక నిముషం నిబంధన అమలులో ఉంటుందని,,ఈ నియమాన్ని ఉల్లంఘించిన విద్యార్ధులను ఎట్టి పరిస్థితిలోనూ పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు..సమయానికి పరీక్షా కేంద్రాలకు  చేరుకోవాలని విద్యార్దులకు సూచించారు..ఉ.930 నుంచి మ.12.45 సమయం మధ్య పరీక్షలు జరగుతాయి..ఉ.9.30 దాటి నిముషం ఆలస్యమైనా పర్మిషన్ ఇవ్వబోమని స్పష్టం చేశారు..పరీక్ష కేంద్రాలోకి సెల్ ఫోన్లు,,ట్యాబ్స్,, ల్యాప్ట్యాప్‌ల వంటి డిజిటల్ పరికరాలపై నిషేధం విధించామని అధికారులు తెలిపారు..పరీక్షలకు 6,10,000 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతుండగా, మరో 55,000 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరుకానున్నారు..ఈ సంవత్సరం నుంచి ఒకే పేపరు విధానంలో పరీక్ష జరుగుతుంది..అంటే ఒక సబ్జెక్టు రెండు పేపర్లతో కాకుండా, ఒక్క పేపర్‌తోనే వంద మార్కులకు పరీక్ష ఉంటుంది..ఈ పరీక్షలకు సంబంధించిన బ్లూ ప్రింట్,,ప్రశ్నా పత్రాలు,,ప్రశ్నలు,,వెయిటేజీ వివరాలను విద్యా శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు..

పరీక్షల షెడ్యూల్:- ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్,, ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్,, ఏఫ్రిల్ 8న ఇంగ్లిష్,, ఏప్రిల్ 10న మ్యాథమెటిక్స్,, ఏప్రిల్ 13న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ),, ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్,,ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్స్,, ఏప్రిల్ 18న ఒకేషనల్ కోర్స్ పరీక్షలు జరుగుతాయి..

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

1 hour ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

5 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

5 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

5 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.