అమరావతి: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 20 వేల కోట్ల రూపాయలతో మత్స్య రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల చెప్పారు..శనివారం నగరంలోని వి.ఆర్.సి మైదానంలో సింహపురి సేంద్రియ మేళాను (ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉప ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం) కేంద్ర మంత్రి,మంత్రి సీదిరి అప్పలరాజుతో కలసి ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పురుషోత్తం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మత్స్య రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తూ, అత్యధికంగా నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 2500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేశామని, మరో రెండు ప్రాజెక్టులను మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా మత్స్యకారులు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. కృష్ణపట్నం వద్ద ఫిషింగ్ జెట్టిని త్వరలోనే నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా జలమార్గంలో ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పోర్టుకు ప్రవేశించినట్లు చెప్పారు. ఈ సాగర్ పరిక్రమ పర్యటన ద్వారా తీర ప్రాంతాల్లో హార్బర్ల స్థితిగతులు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, మత్స్యకారుల జీవన విధానం, మౌలిక వసతుల కల్పనపై నిశితంగా పరిశీలించే అవకాశం కలిగిందన్నారు. మత్స్యకార రంగానికి గత ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రంలో కొత్తగా మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి, తనను మంత్రిగా నియమించినట్లు చెప్పారు. పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తూ మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో మూడు కోట్ల మత్స్యకార కుటుంబాలు, 8000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందన్నారు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోని 30 శాతం మత్స్య సంపద ఉత్పత్తి అవుతుందని, ఇది దేశంలోనే అత్యధికమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు,,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.