థాయ్లాండ్లో గ్యాంబ్లింగ్ అడుతున్న 80 మంది భారతీయులు అరెస్ట్
అమరావతి: థాయ్లాండ్లోని పటాయంలో 93 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకోగా ఇందులో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు..ఈ ముఠాలో 14 మంది మహిళలు పట్టుపడగా వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్ను స్వాధీనం చేసుకున్నట్లు థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు..థాయ్లాండ్ పటాయాలోని ఓ విలాసవంతమైన హోటల్లో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందడడంతో సోమవారం (మే1వ తేదీన) వేకువజామున అక్కడి పోలీసులు దాడులు చేశారు..
మొత్తం 93 మందిని అరెస్ట్ చేశారు..ఇందులో 80 మందికి పైగా భారతీయులే ఉన్నారు..నిందితుల నుంచి రూ.20 కోట్ల నగదు, 8 క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్స్, మూడు నోట్బుక్లను పోలీసులు సీజ్ చేశారు..ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేది వరకు పటాయాలోని ఓ హోటల్లో చాలా మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని థాయిలాండ్ పోలీసులు తెలిపారు..అరెస్ట్ అయిన వారిలో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయ్లాండ్లు, నలుగురు మయన్మార్ జాతీయులు ఉన్నారని పోలీసులు తెలిపారు.